అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యత - ఆధ్యాత్మిక ప్రయాణం

 అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యత - ఆధ్యాత్మిక ప్రయాణం

స్వామియే శరణం అయ్యప్ప! స్వామీ మాలధారులకు, భక్తులకు, మరియు ఆధ్యాత్మికతలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ స్వాగతం! ఈ ఎపిసోడ్‌లో, మనం అయ్యప్ప దీక్ష యొక్క విశిష్టతను, దీని పద్ధతులను, ఆధ్యాత్మిక ప్రయాణంలో దీని ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. మీకు దీక్ష పట్ల అవగాహన కలిగించి, భక్తిని మరింతగా పెంచేందుకు దీనిని రూపొందించాం!”



అయ్యప్ప దీక్ష:  

హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకూ శబరిగిరుల్లో వెలసిన శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుని అయ్యప్ప మాల  ధరించి స్వామిని దర్శించుకుంటారు.

41 రోజుల పాటు( 1 మండలం) కఠినమైన నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు ఈ సమయం లో నల్లని పంచలు, మెడ లో రుద్రాక్ష మాలలు, నుదుట గంధం విభూది తో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. 41 రోజుల దీక్ష  తీస్కోని, అయ్యప్ప ని పూజించే భక్తులను మనం "స్వామి " గా సంభోదిస్తాం. మన శరీరం మరియు మనస్సు 41 రోజులపాటు శిక్షణ పొంది ఒక దినచర్యతో ప్రారంభమై తర్వాత సాధారణ అలవాటుగా మారుతుంది.

మన అలవాట్లు మన ప్రవర్తనగా మారతాయి మరియు మన ప్రవర్తనమన పాత్రగామారుతుంది. కాబట్టి ఒక వ్యక్తి దీక్ష తీసుకుంటూ, అన్ని నియమాలను పాటిస్తే మంచి జరుగుతుంది మరియు సమాజానికి మేలు జరుగుతుంది.
ఒక వ్యక్తి నిజంగా దీక్ష యొక్క అన్ని నియమాలను అనుసరిస్తే లోపల నుండి రూపాంతరం చెందుతాడు. స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటే, అహంకారము నశిస్తుంది మరియు ఎక్కడ అహంకారము నశించునో, అక్కడ దైవత్వం ప్రతిబింబిస్తుంది.


ఈ దీక్షలో ఉండే వారు రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసల మాలల ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడం తో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు, ఆర్భాటాలు, లేకుండా సామాన్య జీవన గడపడం మనకూ అలవడుతుంది.


మనం జుట్టు కత్తిరించడం , గడ్డం గొరుగుట చేయకూడదు, గోళ్లు కత్తిరించకూడదు, శని దోషం ప్రభావం ఎవరి జీవితంలోనైనా కష్టాలు, అడ్డంకులు, మరియు బాధలు తెస్తుందని అందరికీ తెలుసు. కాని  అయ్యప్ప స్వామికి శనిపై నియంత్రణ ఉంది. భక్తుల శ్రద్ధను మరియు భక్తిని చూసి అయ్యప్ప స్వామి, శని భగవానుడికి తన భక్తులపై శని దోషం ప్రభావం రాకుండా నిలవాలని కోరతాడు. 

దీక్షా కాలంలో అయ్యప్ప భక్తులు అనేక సుఖాలను వదులుకుంటారని వారు శబరిమలను సందర్శిస్తే శని దోషం నుండి ఉపశమనం పొందుతారని శని అయ్యప్ప స్వామికి వాగ్దానం చేశాడు. అందుకే శని దోషాన్ని నివారించడానికి అయ్యప్ప స్వామిని ఆరాధించడం అనే విశ్వాసం అయ్యప్ప భక్తులలో బలంగా ఉంది.  అందుకే ఆయనను శనీశ్వరన్ అయ్యప్పన్ అని కూడా పిలుస్తారు.


అయ్యప్పస్వామివారు శని దేవునికి ఇచ్చిన మాట కారణంగా ఈ నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే, దీక్ష తీసుకొన్న వారు తమ అహంకారాన్ని జయించి, ప్రతి ఒక్కరిని స్వామి రూపంగా చూసి గౌరవంగా స్వీకరించాలి.
ఈ దివ్య దీక్షను ప్రారంభించడం ద్వారా మనలో ఉన్న నైతిక విలువలను పెంపొందించుకోవచ్చు. మరింత ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవడానికి మరుసటి ఎపిసోడ్ కూడా చూడండి!”


అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా అయ్యప్ప దీక్ష చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్థానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో ‘స్వామి’ అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు.


ఈ అయ్యప్ప దీక్ష అనునది మళయాళ నెలల లో వృశ్చికం ( నవంబర్ 14/15/16 ) నుండి మొదలవుతుంది. మండల పూజ ( సుమారు25 dec ), మకర సంక్రాంతి ( సుమారు 14jan ) ఈ రెండు రోజలలో అయ్యప్ప స్వామి దర్శనం చేస్కొంటారు. ఈ రెండు రోజలలో మకర సంక్రాంతి రోజు దర్శనం ప్రదానమైనది. ఆ రోజు జ్యోతి దర్శనం జరుగుతుంది. జ్యోతి రూపం లో అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తారు.


శబరిమల ఆలయం, మళయాళ నూతన సంవత్సర మొదటి రోజు, ప్రధాన పండగల రోజు తెరుస్తారు. ఉదా : ఓనం, విశు. 41రోజుల దీక్ష తప్పనిసరిగా తీస్కొని అయ్యప్ప దర్శనం చేయవలెను. ఈ అయ్యప్ప దీక్ష అనునది తల్లి ద్వారా కానీ, గురువుగారి ద్వారా కాని, గురుస్వామి ద్వారా కానితీస్కొనవలెను.
 ఆ రుద్రాక్ష మాల మెడలో పడిన దగ్గర నుండి " స్వామి " అని అందరి చేత పిలువబడుతాడు.
అమ్మాయిలు ఈ దీక్ష తీసుకోడానికి నిబంధనలు ఉన్నాయి. అమ్మాయి 1 -9 వయస్సు లోపు వారు, 50 వయస్సు దాటినా వారు దీక్షకు అర్హులు. దీక్ష తీసుకొన్న ఆడువారిని "మాలికాపురం" గా “మాత” గా పిలుస్తారు.


శరీరానికి, మనస్సుకు శిక్షణ - దీక్ష పద్ధతులు


 దీక్ష తీసుకొన్న వారు ఖచ్చితంగా నియమ నిభంధనలను పాటించాలి. తెల్లవారక ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, శరణు ఘోష చేసి, నైవేద్యం పెట్టాలి.

దీక్షలో భాగంగా కటిక నేలమీద లేదా చాప మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏక భుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు. 

అలాగే స్వామివారు శబరిమలకు వెళ్లినప్పుడు అది పూర్తిగా కొండ ప్రాంతం మరియు అటవీ ప్రాంతం. పాదరక్షలతో ఆ ప్రాంతాల్లో ప్రయాణించలేరు, తదనుగుణంగా చెప్పులు లేకుండా ప్రయాణించడం అవసరం. కాబట్టి ఈ 41 రోజులు స్వామివారు కొండ ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలలోని అన్ని వాతావరణాలను తట్టుకునేలా వారి శరీరానికి మరియు పాదాలకు శిక్షణ ఇస్తారు. ఇది రక్తపోటును నియంత్రించే శరీరానికి ఆక్యుపంచర్ ఇస్తుంది. ఈ దీక్ష శాస్త్రీయ పద్ధతిని కలిగి ఉంది,

జుట్టు కత్తిరింపు, ఉల్లిపాయలు (ఉల్లిపాయలతో తయారు చేసిన ఆహారం), వెల్లుల్లి, బయట రోడ్లపై తినడం  ,మాంసాహారం భుజించడం చేయకూడదు.

ఎందుకంటే, మనం తినే ఆహారం మన ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. గుణాలలో ప్రాథమికంగా సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు ఉన్నాయి. మరియు వాటిని తయారుచేసే మరియు తీసుకునే ఆహారాలు వారి సంబంధిత గుణాల ద్వారా ప్రతిబింబిస్తాయి.

 సాత్విక ఆహారాలు తేలికగా ఉంటాయి మరియు సులభంగా జీర్ణమవుతాయి.-అవి స్పష్టత మరియు అవగాహనను తెస్తాయి.-సాత్విక ఆహారం వ్యక్తిలో ప్రేమ మరియు కరుణను విప్పే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది సంతృప్తి అనుభూతిని ఇస్తుంది.

 మనం పగలు మరియు రాత్రికి ఒకసారి మాత్రమే భోజనం చేయాలి మనం అల్పహారం (ఏఖ భుక్తం) మాత్రమే తీసుకోవాలి, ఇది మన క్లోమం, కాలేయం, పొట్టను శుభ్రపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, రోజుకు ఒకసారి భోజనం చేసేవాడు యోగి, రోజుకు రెండుసార్లు భోజనం చేసేవాడు భోగి, మరియు రోజుకు మూడుసార్లు భోజనం చేసేవాడు రోగి. మనం జీవించడానికి తినాలి, తినడానికి జీవించకూడదు. 

దీక్ష అనేది మిమ్మల్ని మీరు తెలుసుకునే సాధనం. ఈ ప్రక్రియలో మనల్ని మనం బ్రతికించుకోవడం చాలా అవసరం, కాబట్టి శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి సరిపడినంత తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి మరియు అది మనల్ని వ్యాధుల బారిన పడేలా ఎక్కువ భారం వేయకూడదు. 

 మనం నేలపై పడుకోవాలి. అయస్కాంత రేఖల శక్తులు మరియు గ్రహ చలనం కారణంగా భూమి పెద్ద అయస్కాంతం అయినందున ఇది శాస్త్రీయ పద్ధతిని కలిగి ఉంది, ఇది శరీర నొప్పులు, స్పాండాలిటీస్ మొదలైన శారీరక రుగ్మతలకు ఉపశమనం ఇస్తుంది. 

అయ్యప్ప దీక్షలో ఉండే వారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాల బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

తెల్లవారుజామునే నిద్ర లేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజూ దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. 

క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘజీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. 

మనం మధ్యాహ్నం నిద్రపోకూడదు.బ్రహ్మచర్యం తప్పకుండ పాటించాలి. వేరే వారిని పిలిచేటప్పుడు కూడా స్వామి అనే సంభోదించాలి.  

ధూమపానం, మందు తాగటం, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఈ అలవాట్లను వదులుకోవాలి. వాటిని వదిలేయడం ద్వారా స్వీయ నియంత్రణను పాటిస్తారు. పరోక్షంగా ఒకరికి తనపై నమ్మకం కలుగుతుంది, మరియు నెమ్మదిగా ఇది అతని వ్యక్తిగత జీవితంలో విజయపథం వైపు నడిపిస్తుంది. కాబట్టి చెడు అలవాట్లను విడిచిపెట్టడం అనేది వ్యక్తిని ఆనందం మరియు విజయానికి దారితీసే పరివర్తనలో మొదటి అడుగు.

అయ్యప్ప దీక్షలో ఉన్న ఈ కఠిన నియమాలు శరీరాన్ని మరియు మనస్సును 41 రోజులపాటు శిక్షణపొందించేలా ఉంటాయి. ఉదయం వేళ లేవడం, చల్లటి నీళ్లతో స్నానం చేయడం, కఠినమైన వ్రతాలు, మరియు నిరంతర శరణు ఘోష చేయడం వంటి నియమాలు మన ప్రవర్తన, ఆచారాలను మెరుగుపరుస్తాయి. ఇది మనలో ఉన్న అహంకారాన్ని తొలగించి, దైవతత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది.”

స్వామివారి ప్రసాదాన్ని వ్యక్తి యొక్క కులం, మతం, జాతి, హోదా మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోకుండా మాత్రమే తీసుకోవాలి. అన్నం పొందడం మహాభాగ్యం, అదృష్టవంతులకే స్వామివారి ప్రసాదం లభిస్తుంది. 

నాకు తెలిసిన దీక్షకు సంబంధించిన  సూత్రాలు ఇవిఈ నియామాలు పాటించకుండా శబరిమల దర్శనం వ్యర్ధం. " ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి